ఇంద్రవెల్లి, జూలై 2 : రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి మాజీమంత్రి గోడం రామారావ్ చేసిన కృషి మరువలేనిదని పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, మాజీ ఎంపీపీ కనక తుకారాం అన్నారు. మండల కేంద్రంలో శనివారం మాజీ మంత్రి గోడం రామారావ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోడం రామారావ్ చేసిన సేవలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల శాఖ నాయకులు దేవ్పూజే మారుతి, మెస్రం తుకారాం, కోరెంగా సుంకట్రావ్, కనక హనుమంత్రావ్, పోటే సాయినాథ్, నవాబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
రామారావ్ అడుగుజాడల్లో నడవాలి
ఇచ్చోడ, జూలై 2 : మాజీమంత్రి గోడం రామారావ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో రామారావ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి, నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్, ఉపసర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, కృష్ణ కుమార్, పెందూరు తులసీ, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, సిరికొండ, బజార్హత్నూర్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాయిలింగి వృద్ధాశ్రమంలో..
తలమడుగు, జూలై 2: సాయిలింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్, ఆదివాసీ సంఘం నాయకులు మాజీమంత్రి గోడం రామారావ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు అందజేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జక్కుల ప్రభాకర్, సర్పంచ్లు మహేందర్ యాదవ్, కిష్టన్న, రఘునాథ్, నాయకులు దాంజి పటేల్, వెంకటస్వామి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.