తానూర్, జూలై 2 : వానాకాలం పంటల సాగులో వ్యవసాయ అధికారుల సూచనల పాటించాలని నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) అంజీప్రసాద్ రైతులకు సూచించారు. మండంలోని ఉమ్రి(కే) గ్రామంలో శనివారం భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాపై గ్రామంలోని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఏ రకం పంట వేసినా, విత్తనం నాణ్యతగా ఉందా.., లేదా.. చూసుకోవాలన్నారు.
నకిలీ విత్తనాలను గుర్తించే విధానాలను రైతులకు వివరించారు. పంటల సాగుపై సందేహాలు, సలహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఓ రైతు చేనులో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలను చల్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావలే రత్నమాలమారుతి, వ్యవసాయ అధికారి గణేశ్, ఏఈవో నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.