నిర్మల్ టౌన్/కుభీర్, జూన్ 2 : పదోతరగతి ఫలితాలు విడుదలవడంతో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా, ముథోల్, దిలావర్పూర్, లోకేశ్వరం, తానూర్, లక్ష్మణచాంద తదితర మండలాల అధ్యాపకులు శనివారం బృందాలుగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రైవేటులో చదవడం వల్ల ఆరి థకబారం కలుగుతుందని వివరించారు. కుభీర్ మండలకేంద్రంతో పాటు పల్సి, పార్డి(బీ) గ్రామాల్లో లెక్చరర్లు ప్రచారం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న విద్య, వసతులు, ఉచిత అడ్మిషన్లు, స్కాలర్షిప్, పాఠ్యపుస్తకాలు, తదితర విషయాలను వివరిస్తున్నారు. ఇక్కడ అధ్యాపకులు సంపత్ కండ్రాతి, హన్మంత్రావు, భాస్కర్, నరేందర్, శ్రీనివాస్, రాజేందర్, లింగయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.