ఆదిలాబాద్ రూరల్, జూలై 1: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే వ్యాపారులకు జరిమానా విధిస్తామని మున్సిపల్ డీఈ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ డీఈ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సింగిల్యూజ్ ప్లాస్టిక్ నిషేధించామని, ఎవరైనా సరఫరా చేసిన, విక్రయించిన అలాంటి వారిపై మొదటి సారి రూ.500, రెండో సారి వేలల్లో జరిమానా విధిస్తామన్నారు. వీటిని వాడడం వల్ల పర్యావరణంతో పాటు పట్టణంలోని మురుగు కాలువలు, నాలాలల్లోనూ చెత్త పెరిగిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యాపారులు ఇలాంటి ప్లాస్టిక్ను విక్రయించవద్దని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.