నిర్మల్ టౌన్, జూన్ 29 : జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన పెంచాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావురాథోడ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఉద్యానవనశాఖ కార్యాలయంలో ఆయిల్పామ్ సాగు, పండ్ల తోటల పెంపకంపై ఉద్యానవన శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది 11,400 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే సోన్, మామడ, లోకేశ్వరం మండలాల్లో మొక్కలను సబ్సిడీపై అందించినట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు ఫాతిమా, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
పంట వివరాలను పక్కాగా నమోదు చేయాలి
నిర్మల్ జిల్లాలో పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏఈఓలతో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం రైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏడీఏలు వినయ్బాబు, వీణ, సిబ్బంది పాల్గొన్నారు.