నిర్మల్ అర్బన్, జూన్ 14 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని డీఈవో డా.రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం మౌలికసౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్రావు, ఇర్ఫాన్, బీవీ వర్మ సాయన్న, అత్తరొద్దీన్ ఇస్తాక్, రాములు, లక్ష్మణ్, మంజుల నారాయణ, పీడీ భూమన్న, తులసి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల విద్యను ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సోమార్పేట్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారు. కౌన్సిలర్ అపర్ణ ప్రదీప్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహినొద్దీన్, ఎస్ఎంసీ చైర్మన్ తయ్యద్బిన్సలా, ఉపాధ్యాయులు మునీందర్రాజు, ఫరీదా, మనోహర్రెడ్డి, రామారావు, వినోద, రేఖ పాల్గొన్నారు.