నార్నూర్, జూన్ 27 : నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని పొగాకు నియంత్రణ జిల్లా అధికారి శ్రీకాంత్ అన్నారు. మండల కేం ద్రంలోని కిరాణా దుకాణాలు, పాన్షాపుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. సిగరెట్ ప్యాకెట్లపై ధర, తయారీదారు పేరు, క్యాన్సర్ బొమ్మతో కూడిన హెచ్చరిక ఉండాలని పేర్కొన్నారు. క్యాన్సర్ బొమ్మలు లేకుండా పొగాకు అమ్మితే కొట్పా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. పాఠశాలలకు 100 గజాల పరిధిలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని తెలిపారు. ఆయన వెంట తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి, వెంకటస్వామి ఉన్నారు.
కొట్పా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
బేల, జూన్ 27 : సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కొట్పా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం ఆధికారి శ్రీకాంత్ పేర్కొన్నారు. బేల మండలంలో పొగాకు నియంత్రణ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం క్యాన్సర్ బొమ్మతో కూడిన సిగరెట్ ప్యాకెట్లు మాత్రమే అమ్మాలని సూచించారు. సిగరెట్ ఫుల్ ప్యాక్ మాత్రమే విక్రయించాలని, విడిగా అమ్మవద్దని తెలిపారు. సిగరెట్ ప్యాక్పై నిర్ణీత ధర, తయారీదారు పేరు, తదితర సమాచారం కచ్చితంగా ఉండాలన్నారు. బహిరంగ ధూమపానం చేయడం నేరమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోట్పా చట్టాన్ని అతిక్రమించిన ఐదుగురికి జరిమానాలు విధించారు. ఆయన వెంట తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి, వెంకటస్వామి ఉన్నారు.