భైంసా, జూన్ 27 : పట్టణంతో పాటు ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఉర్దూ కంప్యూటర్ సెంటర్లను పునః ప్రారంభించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి విన్నవించారు. టీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం హైదరాబాద్లో ఆయనను క లిశారు. భైంసా, ముథోల్ కంప్యూటర్ సెంటర్లలో మౌ లిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన మైనార్టీలకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట నాయకులు శంకర్ చౌహాన్, రాజేశ్వర్, రామారావు, సాయినాథ్, గంగయ్య, రమేశ్, అరుణ్ ఉన్నారు.