నిర్మల్ టౌన్, జూన్ 25 : నిర్మల్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా అందించే రేషన్ సరుకులను పారదర్శకంగా పంపిణీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. నిర్మల్ పట్టణంలోని ఎంఎస్ ఫంక్షన్హాల్లో రేషన్ డీలర్లకు అందించే పీవోఎస్ మిషన్, బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమలుపై శనివా రం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో 404 రేషన్ షాపుల్లో ప్రతినెలా రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని, లబ్ధిదారులకు సరుకులు సకాలం లో అందజేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు.
‘ఈ-పాస్’ యంత్రంపై అవగాహన
భైంసా, జూన్ 25 : రేషన్ ‘ఈ-పాస్’ యంత్రంపై అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. డివిజన్లోని 152 మంది రేషన్ డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. గతంలో ఒయాసిస్ కంపెనీ మిషన్లు వినియోగించేవారని, వాటి స్థానంలో విజన్ టెక్ కంపెనీ యంత్రాలు వచ్చాయని తెలిపారు. డీలర్లు వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఫోర్జీ సేవలతో పెన్షన్దారులకు వేగంగా పింఛన్ ఇవ్వవచ్చని తెలిపారు. తహసీల్దార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.