ఆదిలాబాద్ రూరల్, జూన్ 25 : ఆదిలాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పట్టణ ప్రగతి ద్వారా పరిష్కరిస్తున్నామని ఎమ్మె ల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని 29వ వార్డులోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్లో శనివారం పెద్ద డ్రైనేజీలు, రోడ్లు, భగీరథ పైపులను పరిశీలించారు. కాలనీ వాసులను సమస్యలు అ డిగి తెలుసుకున్నారు. సవారీ బంగ్లా నిర్మాణానికి భూమిపూజ చేశారు. కోట్లాది రూపాయలతో పట్టణంలోని ప్రతి కాలనీలో సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సురక్షితమైన తాగునీరులాంటి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. పట్టణ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, కేంద్రం మాత్రం తె లంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ నిధులు వి డుదల చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ నా యకులు ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వెలికితీసి, జన్ధన్ ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. జిల్లాలను విభజించి ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం అవకాశం వచ్చేలా చూస్తున్నామని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు శ్రీనివాస్, మోబిన్, నాయకులు పండ్ల శ్రీనివాస్, రంగినేని శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.
నిరుద్యోగుల కోసమే మినీ గ్రంథాలయాలు..
నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసమే పట్టణంలో నాలుగు మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉధ్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని చెప్పారు.
అందుకు అనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు లేవని పేర్కొన్నారు. అందుకే నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి నష్టపోకుండా జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంతో పాటు మరో నాలుగు మినీ గ్రంథాలయాలను జోగు ఫౌండేషన్ సహాయంతో ఏర్పాటు చేసి వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిరుద్యోగులు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అశోక్, ప్రకాశ్, నాయకులు యూనుస్ అక్బానీ, బండారి వామన్ పాల్గొన్నారు.