జైనథ్, జూన్ 25 : రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం మాదేనని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బండలనాగాపూర్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం నాయకులతో కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటల్లో కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. మిగతా 75శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్న రాష్ట్రం తమదేనన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందజేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటలను కేంద్రం కొనడానికి అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభు త్వం కొంటుందన్నారు. ఈ సందర్భంగా జొన్న రైతులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ సురకంటి శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, ఏవో రవీందర్, పీఏసీఎస్ సీఈవో కేశవ్, సర్పంచ్లు గంగుల వెంకన్న, సదానందం, కేశవ్రెడ్డి, ఎంపీటీసీ అశోక్, రఘు, రైతులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తలమడుగు, జూన్ 25 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని అర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు రుయ్యాడి గ్రామంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల అదనపు తరగతుల నిర్మాణానికి మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. పల్లె ప్రగతితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, పల్లె ప్రకృతివనం, తెలంగాణ క్రీడామైదానం, డంప్ యార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
పేదల కోసం దేశంలో ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. విడుతల వారీగా అర్హులందరినీ దళితబంధు పథకానికి ఎంపిక చేస్తామని తెలిపారు. అర్లి గ్రామం నుంచి బరంపూర్, రుయ్యాడి వరకు బీటీ రోడ్డు మంజూరుకు కృషి చేస్తానన్నారు. గ్రామాల్లోని పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ కిష్టన్న, జడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎంపీటీసీలు సుష్మిత, చంటి, నాయకులు టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు కళ్యాణం రాజేశ్వర్, మోట్టె కిరణ్, కాల్వ మల్లేశ్, వెంకట్రెడ్డి, అబ్దుల్లా, ఆశన్న యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.