ఎదులాపురం, మే 25 : రిమ్స్లో సా ధారణ ప్రసవాలను పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ డాక్టర్లను ఆదేశించారు. రిమ్స్లోని ఈఎన్టీ, ప్రసూతి వార్డులను బుధవారం తనిఖీ చేశా రు. అందుతున్న వైద్యసేవలు సాధారణ ప్రసవాలకు తీసుకుంటున్న చర్యలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ వల్ల కలిగే అనర్థాలు , సా ధారణ ప్రసవాల కలిగే లాభాలను గర్భిణులు, కు టుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రసూతి వార్డు వైద్యులు, సిబ్బంది పని తీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ , డాక్టర్లు తిప్పస్వామి, పద్మిని, రామకృష్ణ పాల్గొన్నారు.
పోషకాహారం అందించాలి
వయసుకు తగిన బరువు, ఎత్తు లోపంతో ఉన్న పిల్లలకు మెరుగైన వైద్యంతో పాటు పోషకాహారం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మహిళా , శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిపై సీడీపీవోలు, సూపర్ వైజర్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో పోషకాహార దినోత్సవాలు నిర్వహించి , సంబంధిత శాఖల అ ధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించామన్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామాల వారీగా పోషకాహార దినోత్సవాలు నిర్వహించి ప ర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సమయంలోగా సరుకులు పంపించి బియ్యం గు డ్లు, పాలు, తదితర వాటి నిల్వ, ఖర్చుల వివరాల టను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు.
జూన్ మొదటి వారంలోగా ప్రవేశాలను పూర్తి చేయాలి
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లో జూన్ మొదటి వారంలోగా విద్యార్థుల ప్రవేశాలను పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో 19 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 2100 మంది, 3 పోస్ట్మెట్రిక్ వ సతి గృహాల్లో 300 మంది బాలబాలికలకు వసతి కల్పించినట్లు చెప్పారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు రిజ్వా న్ బాషా షేక్, ఎన్. నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి భగత్ సునీతాకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, సీడీపీవోలు ,సూపర్వైజర్లు పాల్గొన్నారు.