ఖానాపూర్ టౌన్, మే 25: పట్టణంలో మంగళవారం రాత్రి వడగళ్ల వాన బీభ త్సం సృష్టించింది. పలు వార్డుల్లోని రోడ్లపై చెట్లు విరిగిపడగా మున్సిపల్ చైర్మన్ అం కం రాజేందర్ సిబ్బందితో తొలగించారు. తహసీల్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ప ట్టణంతో పాటు 24 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. అలాగే వరిధా న్యం తడిసింది. స్థా నిక ఎమ్మెల్యే రేఖానాయక్ విద్యుత్ శాఖ అధికారులతో ఫో న్లో మాట్లాడి త్వరగా మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని సూ చించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, ప్ర జాప్రతినిధులు, అధికారులు పలు వార్డుల ను, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఖానాపూర్ రూరల్, మే 25 : మండలంలోని తర్లపాడు, పాత తర్లపాడు, సత్తనపల్లి, బీర్నంది గ్రామాల్లో వరి, నువ్వు పం టలకు నష్టం వాటిల్లింది. సింగపూర్లోని గోండుగూడలో కనక సునీత ఇంటి పై కప్పు లేచిపోయింది. మస్కాపూర్లో విద్యుత్ స్తంభాలు విరిగాయి. మెట్పల్లి రహదారిపై చెట్టు విరిగిపడగా రాకపోకలు నిలిచిపోయాయి. దిలావర్పూర్ బద్ది పో చమ్మ ఆలయం వద్ద వందల ఏళ్లనాటి భా రీ వృక్షం కూడా పడిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
కడెం, మే 25: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సర్పంచ్ బొడ్డు గంగన్న, పోలీసుల సహకారంతో ట్రాక్టర్ ద్వారా చెట్లను తొలగించారు. అలాగే గ్రామంలో పలువురు ఇండ్ల పైకప్పు ఎగిరిపోయాయి.
దస్తురాబాద్, మే 25 : మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సా యంత్రం వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కడెం, ఖానాపూర్ మండలాల్లో ఈ దురు గాలులతో కురిసిన వర్షానికి స్తం భాలు విరిగిపడ్డాయి. విద్యుత్ లైన్లపై చెట్లు పడడంతో రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఏఈ శ్రీనివాస్ అధికారులు, సిబ్బం ది మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.