ఉట్నూర్ రూరల్, మే 25: జంతువుల కోసం అనువైన గడ్డిజాతి మొక్కలు పెంచాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ రామలింగం అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయిపేట అటవీ శాఖ రేంజ్ పరిధిలోని జంతువుల కోసం గడ్డి పెంచేందుకు స్థలాన్ని ప్రొఫేసర్ మురద్నర్, నిర్మల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్కుమార్, ఆదిలాబాద్ డీఎఫ్వో చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. ప్రొఫేసర్ గడ్డి జాతుల మొక్కల గురించి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ మాట్లాడుతూ జంతువుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జంతువులకు అవసరమైన ఆవాసాల ఏర్పాటు, గడ్డి, నీరు, చెట్లు పెంచడం, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. అదేవిధంగా అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఎఫ్డీవో రాహుల్ కిషన్, ఇచ్చోడ ఎఫ్డీవో బర్నోబా, బీర్సాయిపేట ఎఫ్ఆర్వో గులాం మొయినొద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.