తాంసి, మే 24 : వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధిక దిగుబడులు వచ్చేలా చూడాలని, అందుకు కొత్త వంగడాలను సృష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో మంగళవారం విత్తనమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగుకోసం ఎంతగానో కృషిచేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అవసమైన విత్తనాలు, ఎరువులు అందుబాటు లో ఉంచుతున్నామన్నారు. కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి, ఆర్థికంగా బలోపేతమవ్వాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా సాయిల్టెస్ట్ చేయించుకోవాలని, నేలలో లోపాలను సరిచేసుకుంటేనే అధిక దిగుబడులు సాధ్యమన్నారు.
ఎరువులు అధికంగా వాడినా అనర్థం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, నేల సత్తువ కోల్పోతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అధికారులు మొ క్కలు అందజేసి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టాండింగ్ కమిటీ మెంబర్ బక్కి గోవర్ధన్ యాదవ్, ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్చౌహాన్, కేవీకే ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ తిరుమల్రావు, డాక్టర్ డీ మోహాన్దాస్, వ్యవసాయశాఖ ఏడీఏ రమేశ్, రైతుసంఘం నేతలు దారట్లకిష్టు, నరేశ్జాదవ్, కేమ లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.