భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ని ర్మాణాలను ఆదివారం పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆరేళ్లక్రితమే 100 డబుల్ బెడ్రూం లను నిర్మించి పేదలకందించిన ఎంపీపీ మంజుల, సర్పంచ్ వెంకన్నను అభినందించారు. రైతుబంధు, బీమా పథకాలు, ఉచిత విద్యుత్ అనేవి దేశానికి ఆదర్శం గా నిలుస్తున్నాయన్నారు. భీంపూర్ మండలానికి చెందిన అడ్డి భోజారెడ్డి డీసీసీబీ చైర్మన్గా కావడం ఈ ప్రాంత రైతులకు ఒక వరమేనని పేర్కొన్నారు. ప్రగతిని నిరోధించే క్రమంలో కొ న్ని దుష్టశక్తులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నాయని వాటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు , కుమ్ర సుధాకర్, సర్పంచ్లు స్వప్న, గంగుల వెంకన్న, నాయకులు రత్నప్రకాశ్, ఏ నుగు అశోక్రెడ్డి , అరుణ్కుమార్, కంది గోవర్ధన్రెడ్డి, వన్నెల నరేశ్, శ్రీధర్రెడ్డి ఉన్నారు.