జైనథ్, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక- కొరాట బ్యారేజ్తో పాటు హత్తిఘాట్ వద్ద పవర్హౌస్ పనులను గడువులోగా పూర్తిచేయాలని, వానకాలం నాటికి రైతులకు సాగు నీరు అందించాలని అధికారులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జైనథ్ మండలంలోని హత్తిఘాట్ వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్ పనులను సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంవో మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తిచేసి, వానకాలంలోగా డ్రైరన్, ట్రయల్న్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పిప్పల్కోటి కుడి కెనాల్ పూర్తిచేసేందుకు 800 ఎకరాలు ఎక్విజేషన్ పూర్తిచేయాల్సి ఉంటుందని అధికారులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద కాలువతో పాటు చిన్న కాలువలు నిర్మించాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఈఎంసీ వెంకటేశ్వర్లు, సీఈ వెంకటకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, దేవేందర్రెడ్డి, ఎస్ఈ రాము, ఈఈలు రవీందర్, వేణుగోపాల్, కాంట్రాక్టర్ మురళీధర్రెడ్డి, రామకృష్ణ, సుమిత్రరావ్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.