నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లు రాష్ట్రమే కొంటుందని ప్రకటించి, సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడు అనిపించు కున్నారని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల సంబురాలు నిర్వహించారు. నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ం, భైంసా మండలం తిమ్మాపూర్, కుంటాల మండల కేంద్రం, కల్లూర్, బాసర, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాలాభిషేకం చేశారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులను మోసం చేసినా సీఎం కేసీఆర్ వారికి అండగా నిలిచారని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, పెద్దఎత్తున పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, అధికార ప్రతినిధి సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, రైతు బంధు సమితి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు వేణు, రమణ, మతిన్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అప్పాల వంశీ, నాయకులు రాజు, కొండ శ్రీధర్, సలీమ్, అనిల్, రాఘవేందర్, గంగారెడ్డి, నర్సయ్య, మంగ్లారపు పోశెట్టి, కిషన్, గండ్రత్ రమేశ్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో..
భైంసాటౌన్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో రైతులు, నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ లస్మన్న, నాయకులు నవీన్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, గోపి, గణేశ్, నవీన్ పాల్గొన్నారు.
కుంటాలలో..
కుంటాల, ఏప్రిల్ 13: యాసంగి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండల కేంద్రంలో రైతులు సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్బీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాటి మహేశ్, ఆత్మ డైరెక్టర్ భూమన్న, తెలంగాణ జాగృతి కన్వీనర్ లక్ష్మణ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు వెంకటేశ్, పురుషోత్తం, రాకేశ్, వినోద్, నాగరాజు పాల్గొన్నారు.
కల్లూర్లో..
కల్లూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు దశరథ్, భోజన్న, నవీన్ రెడ్డి, వెంకటేశ్, మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.
బాసర సరస్వతీ ఆలయంలో పూజలు
బాసర, ఏప్రిల్ 13 : బాసర సరస్వతీ ఆలయంలో రైతులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.
బోథ్లో..
బోథ్, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ సురేందర్యాదవ్, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు రాజు, శ్రీనివాస్, సత్యనారాయణ, సదానం దం, నారాయణరెడ్డి, ప్రవీణ్, నరేందర్ బుచ్చన్న, రవీందర్, లక్ష్మణ్, దేవీదాస్ పాల్గొన్నారు.