ఎదులాపురం, జనవరి 26 : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో మొదటి డోస్ వంద శాతం, రెండో డోస్ 90 శాతం, బూస్టర్ డోస్ 80 శాతం పూర్తయిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. త్వరలో జిల్లాలో కొవిడ్ నుంచి సేఫ్ అవుతామని అన్నారు. గణతం త్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దళితబంధు ఈ నెలలో ప్రారంభించామని, ఫిబ్రవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చిలో యూనిట్లకు గ్రౌండింగ్ చేస్తామని తెలిపారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటించడం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, అదనపు ఎస్పీలు వినోద్కుమార్, శ్రీనివాస్రావు, ఆర్డీవో రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, జిల్లా పౌర సంబంధాల అధికారి భీంకుమార్, తహసీల్దార్ భోజన్న, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు ముఖ్య కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశా రు. పోలీస్ శిక్షణ కేంద్రంలో అదనపు ఎస్పీ సమ య్ జాన్రావు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీసీఎస్ స్టేషన్లో సీఐ ఈ చంద్రమౌళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమం లో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస రావు, ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి, పట్టణ సీఐలు పోతారం శ్రీనివాస్రావు, ఎస్ రామకృష్ణ, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ కార్యాల యం ఏవో మహ్మద్ యూనిస్ అలీ, పర్యవేక్షకులు జోసెఫిన్, సెక్షన్ అధికారులు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కోర్టు కార్యాలయంలో..
జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు డాక్టర్ శ్రీనివాస్రావు, ఉదయ్ భాస్కర్రావు, మంజుల, ఉద్యోగులు, ఏవోలు, సూపరింటెండెం ట్లు పాల్గొన్నారు.
రెండో బెటాలియన్లో..
యాపల్గూడలోని తెలంగాణ ప్రత్యేక రెండో బెటాలియన్లో కమాండెంట్ వేణుగోపాల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అదన పు కమాండెంట్ శ్రీఎం జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ రిజర్వ్ సీఐ, ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం. జనవరి 26 : జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, ఐసీడీఎస్ జిల్లా అధికారి మిల్కా, డీపీవో కార్యాలయంలో శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ అభివృద్ధి కార్యాలయంలో రాజలింగు, జడ్పీ సీఈవో గణపతి జెండాను ఎగురవేశారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, మాజీ సైనిక సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ వైద్యప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఆదిలాబాద్ రూరల్, జనవరి 26: జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలను పేదలకు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
పట్టణంలోని మున్సిపల్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సైనిక్ సంక్షేమ భవనంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని అన్నారు. 70 ఏళ్లలో సాధించలేని ప్రగతి నేడు సాధించామని తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ రమేశ్, ప్రేమల, యూనిస్ అక్బానీ, స్వరూప, సత్యనారాయణ పాల్గొన్నారు.
అమరులకు శ్రద్ధాంజలి..
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న కార్గిల్ పార్కులో అమరులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశు ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కార్మికులు చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ బండారి సతీశ్, దమ్మపాల్, పండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి , జనవరి 26 : మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పుష్పలత, గ్రంథాలయంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్లో చైర్మన్ మారుతి డొంగ్రే, ఇంద్రవెల్లి పీహెచ్సీలో వైద్యుడు శ్రీకాంత్, పశువైద్యశాలలో వైద్యురాలు మహేశ్వరి, అటవీ శాఖ కార్యాలయం లో ఎఫ్ఆర్వో పాండునాయక్, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ, అంబేద్కర్ చౌక్లో సర్పంచ్ కోరెం గా గాంధారి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, రాష్ట్ర మహి ళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ అమ్జద్, ఏఎంసీ కార్యదర్శి రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి 26: మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో హర్షవర్ధన్, ఆర్డీవో కార్యాలయంలో జాడి రాజేశ్వర్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సతీశ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తిరుమల, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, జడ్పీటీసీ చారులత, పంచాయతీలో ప్రత్యేక అధికారి మహేశ్ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ బాలాజీ, నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వారి కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు.
బేల మండలంలో..
బేల, జనవరి 26 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బడాల రాం రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిత ఠాక్రే, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణ కుమార్, ఐకేపీలో ఏపీఎం కిరణ్ కుమార్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో అరుణ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేశా రు. కార్యక్రమంలో నాయకులు దేవన్న, సతీశ్ పవార్, ప్రమోద్ రెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉద్యోగులు రాజశేఖర్ గణపతి, చారి, గులాబ్ శంకర్, విజయశ్రీ, ఆకాశవాణి కేంద్ర ప్రాంగణంలో స్టేషన్ డైరెక్టర్ వీ రాజేశ్వర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం హెడ్ రామేశ్వర్ కేంద్రే, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన రెడ్ క్రాస్ సొసైటీ, సీపీఎం, బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రచార రథయాత్ర నిర్వహించారు. కార్యక్రమం లో అబ్దుల్ అజీజ్, రవి పాల్గొన్నారు.