నార్నూర్, ఫిబ్రవరి 25 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి 64 లక్షలు మంజూరయ్యాయి. రెండు మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో అంతర్గత మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారనున్నాయి.
నార్నూర్ మండలం చోర్గావ్, ఎంపల్లి(జీ), గుండాల, ఖంపూర్, కొత్తపల్లి(హెచ్), మలేపూర్, మర్పగూడ(దేవ్పటార్), సుంగపూర్, బేతల్గూడ (సోనాపూర్), బాబేఝరి(చిత్తగూడ), భీంపూర్(గోండుగూడ), గంగాపూర్, గుంజాల(బొజ్జుగూడ), ఖైరదాట్వ, జామ(లాల్షావ్ పటేల్గూడ), మలంగీ, మాన్కాపూర్, ఉమ్రి గ్రామాలకు రూ.3 లక్షల చొప్పున, బలాన్పూర్, మహాగావ్, నాగల్కొండకు రూ.4 లక్షల చొప్పున, నార్నూర్కు రూ.9లక్షలు మంజూరయ్యాయి. అలాగే గాదిగూడ మండలం ఆదిమ్యాన్, బొడ్డిగూడ, డోంగార్గావ్, రోమాన్కసా, రోమాన్కసా కొలాంగూడ, అర్జుని మారుగూడ, దాబా(బీ), దాబా(కే) పునగూడ, ఖాడ్కి, ఖాడోడి, మేడిగూడ, పర్సువాడ(బీ), హీరాపూర్, లోకారి(బీ), పర్సువాడ(కే), ఫిప్రి, గాదిగూడ, ఖాండో గ్రామాలకు రూ. 3 లక్షల చొప్పున, కొలామా, కునికాసా(జీ), లోకారి(కే), ఫిప్రి, రాంపూర్, రూప్పాపూర్, సాంగ్వీ, సావ్రీ, లోకారి(బీ) గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4లక్షల చొప్పున మంజూరయ్యాయి.
ఉపాధి హామీ నిధులతో బాబేఝరి గ్రామంలో మట్టి రోడ్లకు మహర్దశ పట్టనుంది. గ్రామంలో పలు చోట్ల మట్టి రోడ్లు గుంతలు పడి ఉండడంతో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సారి విడుదలైన నిధులతో గ్రామంలో దాదాపు మట్టి రోడ్లు సీసీగా మారుతాయి.
-రాహుల్, గ్రామస్తుడు, మర్పగూడ
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో మట్టి రోడ్లు అన్ని సీసీ రోడ్లుగా మారనున్నాయి. ఈ సారి విడుదలైన నిధులతో గ్రామ పంచాయతీల్లో మట్టి రోడ్లు ఏమి లేకుండా అన్ని సీసీ రోడ్లుగా మారనున్నాయి. గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-జంగు, సర్పంచ్, పర్సవాడ