ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 6 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన సీసీఐ ఉద్యమ సెగ రాజ్యసభను తాకింది. సీసీఐ పునరుద్ధరణపై రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కే.కేశవరావు ప్రస్తావించారు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిపై స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఎంపీ సోయం బాపురావ్ పార్లమెంట్లో మా ట్లాడాలని కోరారు. ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్తో సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 43వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షలో సాధన కమిటీ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని, సీసీఐని వెంటనే పున:ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ,అరుణ్ కుమార్, బండి దత్తాత్రి, దేవిదాస్, లోకారి పోశెట్టి, ఈశ్వర్, రాహుల్, కొండ రమేశ్, రాహుల్, సునీల్, ఈశ్వర్ దాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.