ఎదులాపురం,ఫిబ్రవరి15: సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా మంగళవారం స్థానిక రిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా రిమ్స్ ఆవరణలోని శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ప్రత్యేక పూజల అనంతరం రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. అనంతరం రిమ్స్లో వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. ప్రజా సంక్షేమ కోసం నిరంతరం పాటు పడే సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. బుధవారం రక్తదాన శిబిరం, గురువారం సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లబ్ధిదారులకు వంద శాతం సబ్సిడీపై చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయ న్నారు. దళిత బస్తీ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 44,300 ఎకరాల భూమి అర్హులకు అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఎంపీపీ సెవ్వా లక్ష్మీ జగదీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో 90 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందిన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే జోగు రామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణను యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉమ్మడి 10 జిల్లాలో వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే పక్కా భవనాలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ బీసీ స్డడీ సర్కిల్లో ఉద్యోగార్థులకు 37 బ్యాచ్ల్లో శిక్షణ ఇచ్చామని, ఇందులో 220 మందికి ప్రభుత్వ ఉద్యోగుల సాధించారన్నారు. తర్వలోనే రాష్ట్ర ప్రభుత్వం 75వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందని చెప్పారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ను అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీబీసీడీవో రాజలింగు, కౌన్సిలర్లు బండారి సతీశ్, నాయకుడు రాంకుమార్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్ ,ఫిబ్రవరి15:గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్లో క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం ప్రారభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న దన్నారు. పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనం తరం అంకోలి సమీపంలోని షాదుల్లా బాబా దర్గా ఇమామ్ ఖాసీం బంగ్లాను దర్శించుకొని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, సెవ్వ జగదీశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, ఎంపీటీసీలు జంగుపటేల్, జంగుబాపు, సర్పంచ్ భూమన్న, విలాస్, టీఆర్ఎస్ నాయకులు ఆరె నరేశ్, గ్రామస్తులు ఉన్నారు.