తాంసి/బేల, మార్చి12 : ఆయిల్పాం తోటల సాగుపై రైతులు దృష్టిసారించాలని హర్టికల్చర్ అధికారి(హెచ్వో) ఎస్ మహేశ్ అన్నారు. జిల్లాలోని తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్,ఇంద్రవెల్లి, ఉట్నూర్, నేరడిగొండ, బేలకు చెందిన 100మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయిల్పాం తోటల క్షేత్రపర్యటనకు తీసుకెళ్లారు. ఆయిల్ పాం సాగుకు సంబంధించిన వివరాలను జిల్లా రైతులకు తెలియజేశారు. సాగు విధానం, అంతర కృషి, పంటకాలం, దిగుబడి, మార్కెటింగ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం తోటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. రైతులు ఈ తోటలను సాగు చేయడానికి ముందుకురావాలని సూచించారు. రైతులకు అవసరమైన మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను కూడా రాయితీపై అందజేస్తున్నదని చెప్పారు. బడ్జెట్లో కూడా ఆయిల్పాం సాగుకు రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ క్షేత్రపర్యటనలో రైతులు విఠల్, ఆనంద్రెడ్డి, రమేశ్, ఆశన్న, గంగారాం, తిరుపతి తదితరులున్నారు.