సారంగాపూర్, ఫిబ్రవరి 4 : సారంగాపూర్ మండలం మహబూట్ ఘాట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం అరుదైన వృక్షశిలాజాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహ్యాద్రి పర్వతాలుగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ ఘాట్ అటవీ ప్రాంతంలో వృక్ష, జీవవైద్యానికి ఈ వృక్షాలు ఎంతో పేరుగాంచాయన్నారు. అటవీ ప్రాంతలో రాతి స్తంభాలు ఉన్నాయని, అలాగే లక్షల ఏండ్ల నాటి వృక్షాల శిలాజాలు గుర్తించినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో నేలకూలి భౌతిక పరిస్థితుల వల్ల ఫాజిలైసేషన్ చెందిన రాతిలా గట్టిపడి, వృక్షశిలాజంగా మారాన్నారు. ఇలా మార్పు చెందే రసాయనిక మార్పును ఫాజిలైసేషన్ అని అంటారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి వృక్ష నత్తగుళ్లల శిలాజాలను గుర్తించినట్లు తెలిపారు.