ఎదులాపురం,డిసెంబర్17: వైద్య శాఖ భవనాల నిర్మాణాలు, మరమ్మతు పనులను నెలాఖారులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇంజినీరింగ్ ,వైద్య శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పనులను పూర్తిచేయాలన్నారు. బేల, తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని చెప్పారు. 15 కొత్త సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. 74 సబ్ సెంటర్ల భవనాల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా పనులకు సంబంధించిన ఫొటోలను సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
దంతన్ పల్లి , పిట్ట బొంగరం, గాదిగూడ, ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా బీఎస్ఎన్ఎల్ ఇంజినీరింగ్ అధికారు లు పనులు పూర్తి చేయాలన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పా టు చేయనున్న కార్యక్రమాలపై సంబంధిత వైద్యాధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లాలో వైద్య శాఖ ద్వారా చేపడుతున్న బర్త్ ప్లానింగ్, ప్రసవాలు, ఇమ్యునైజేషన్, టీబీ, టీ-హబ్లపై సమీక్షించారు. రిమ్స్ దవాఖా నలో ఓపీల సంఖ్య పెంచడంతో పాటు, సాధారణ ప్రసవాలు, ఇతర వైద్య చికిత్సలపై ఆదేశాలు జారీ చేశారు. ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, పంచాయ తీరాజ్ ఈఈ మహావీర్, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాధన, డీఎంవో శ్రీధర్, అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్, టీబీ నియంత్రణ అధికారి ఈశ్వర్రాజ్, బోథ్ సీహెచ్సీ డాక్టర్ రవీంద్రప్రసాద్ ఉన్నారు.