కుభీర్, డిసెంబర్ 17 : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులను కమిటీ చైర్మన్ కందూర్ సంతోష్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో కొన్ని పార్టీలకు వణుకు మొదలైందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు, దళిత బంధు, దళితబస్తీ, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రైతుల కోసం కనీస రక్షణ కల్పించే పథకాలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా బీఆర్ఎస్ పటిష్టతకు చేస్తున్న కృషిని కొనియాడారు. భైంసా, కుభీర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు సంతోష్, పిప్పెర కృష్ణ రెండేళ్ల నుంచి ఎంతగానో అభివృద్ధి చేశారని అభినందించారు. చైర్మన్ల పదవీకాలం శనివారంతో ముగియనుందని, సేవలను పార్టీకి, ప్రభుత్వానికి అవసరమని.. తప్పక వినియోగించుకుంటామని చెప్పారు.
చైన్మన్, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అంతకు ముందు ఆయన మార్క్ఫెఢ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్ సోదరి పెండ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, చైర్మన్, వైస్ చైర్మన్ సంతోష్, దిగంబర్ పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, జడ్పీటీసీ అల్కాతాయి, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, కుభీర్ సర్పంచ్ పానాజీ మీరా, విజయ్కుమార్, గోనె కల్యాణ్, సూది రాజన్న, భైంసా రాము, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ ఎన్ దత్తూగౌడ్, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మండలంలోని వటోలి గ్రామానికి చెందిన రుక్మాబాయికి రూ. 30 వేలు, లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన సుమలతకు రూ. 28 వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయ్యాయి. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనివారం వారికి చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ నాయకుడు సచిన్ పటేల్ ఉన్నారు.