నార్నూర్, డిసెంబర్ 15 : గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ఈ నెల 23వ తేదీన క్రాంతివీర్ కుమ్రంభీం జాతర నిర్వహించనున్నట్లు సర్పంచ్ మెస్రం దేవ్రావ్ తెలిపారు. గురువారం లోకారి(కే) గ్రామంలోని కుమ్రం భీం చౌరస్తా వద్ద ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జాతర కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు చిరువ్యాపారులు, సినిమా టాక్సీలు, సర్కాస్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జాతర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీ సోయం బాపురావ్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్, ఎంపీపీ చంద్రకళారాజేశ్వర్, వైస్ఎంపీపీ యోగేశ్, జడ్పీటీసీ గంగుబాయీసోము, అధికారులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగోరా వ్, గ్రామపెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.