ఎదులాపురం,డిసెంబర్15: పోలీస్ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీసీటీవీల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ గురువారం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ నెల 19వరకు ఈవెంట్స్ కొనసాగుతాయన్నారు.1287 అభ్యర్థులు హాజరు కాగా, 603 మంది అన్ని పరీక్షల్లో అర్హత సాధించారన్నారు. 157 మంది గైర్హాజరు కాగా, 527 మంది డిస్క్వాలిఫై అయినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ సీ సమయ్జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సీహెచ్ నగేందర్, ఐ జీవన్ రెడ్డి ఎస్ సుందర్రావు, పోలీస్ కార్యాలయం ఎస్వో యూనుస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, జిల్లాలోని సీఐ, ఎస్ఐ, ఆర్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ, సిబ్బంది ఉన్నారు.