ఎదులాపురం, డిసెంబర్ 9 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ హెడ్కార్వర్ట్స్లో నిర్వహిస్తున్న దేవాదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. మొత్తం 782 మందికి గానూ 667 మంది హాజరయ్యారు. వీరిలో 115 మంది గైర్హాజరయ్యారు. 327 మంది అభ్యర్థులు అన్ని ఈవెంట్స్లలో ఉత్తీర్ణత పొంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. మరో 340 మంది వివిధ అంశాల్లో డిస్ క్వాలిఫై అయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి మాట్లాడారు. శని, సోమవారాల్లో మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులు పాల్గొన్న వివిధ ఈవెంట్స్ను ఎస్పీ పర్యవేక్షించారు. అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్జాన్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డీఎస్పీలు వీ ఉమేందర్, వీ వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, ఉమా మహేశ్వరరావు, సీఐలు , ఎస్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్ కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ, ఉమ్మడి జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.