భీంపూర్, నవంబర్ 29 : టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. భీంపూర్లో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి దీక్షా దివస్ నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడావి లింబాజీ , బక్కి అజయ్ యాదవ్, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు కుడిమెత సంతోష్, జీ నరేందర్యాదవ్, కాసవేణి అనిల్యాదవ్, అఫ్రోజ్, రవూఫ్, కేమ గంగయ్య, పాండురంగ్, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
కుభీర్లో దీక్షా దివస్
కుభీర్, నవంబర్ 29 : కుభీర్ మార్కెట్ యార్డులో దీక్షా దివస్ను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముందుగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేసిన కేసీఆర్.. తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు, తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇదని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కందుర్ సంతోష్, మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మాజీ సర్పంచ్ గోరేకర్ బాబు, సూది రాజన్న, గోనే కల్యాణ్, వడ్నం దత్తాత్రి, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, నవంబర్ 29: టీఆర్ఎస్ బోథ్ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్సింగ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచ్ జీ సురేందర్యాదవ్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎలుక రాజు, మల్లెపూల సుభాష్, కే వెంకటరమణాగౌడ్, నరేందర్, ఎస్వీ రమణ, డీ నారాయణరెడ్డి, సత్యనారాయణ, బుచ్చన్న, రఫీ, గంగాధర్, సంజీవ్రెడ్డి, లక్ష్మణ్, స్వామి, దేవిదాస్, నర్సయ్య పాల్గొన్నారు.