దండేపల్లి, నవంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో సోమవారం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచులు కుర్సెంగ కళావతి, మర్సుకోల లచ్చుపటేల్, ఎంపీటీసీ బోడ అమృతాబాయి, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, బట్టు రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు కందుల అశోక్, మాడ దయాకర్, లక్ష్మణ్గౌడ్, కంది రవి, గుమ్మడి రవి, ముత్తె లచ్చయ్య, అడాయి శంకర్, పొడేటి రవి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, తదితరులున్నారు.