గర్మిళ్ల/బెల్లంపల్లి/మందమర్రి/కాగజ్నగర్, నవంబర్ 25;మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో శుక్రవారం పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్కు వినతులు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే దివాకర్రావుతో పాటు బీ(టీ)ఆర్ఎస్, ఆయా సంఘాల నాయకులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందించారు. పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన జీఎం.. కాగజ్నగర్లో మాత్రం ఆగకుండా వెళ్లిపోవడం అక్కడున్న వారికి నిరాశ కలిగించింది.
కాజీపేట – బల్లార్ష మ ధ్య రైల్వేస్టేషన్ల సందర్శనలో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నాయకులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు స్టేషన్లో ఆగేలా చూడాలని, ఉర్దూలోనూ స్టేషన్ పేరు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం జీఎం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే కాలనీలోని మహిళలతో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమ స్య ఉందని, కాలనీలోని ప్రధాన ద్వారం వద్ద గేటు ఏర్పా టు చేయాలని, పిల్లలకోసం పా ర్కును కట్టించాలని ఆయనకు విన్నవించారు. అక్కడే పని చేస్తున్న రైల్వే ట్రాక్మెన్లతో మాట్లాడారు. వా రి వద్ద ఉన్న ప్రథమ చికిత్స పెట్టెను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో లేబ ర్ రూమ్, హమాలీ షెడ్ను ప్రారంభించారు.
పలువురు వినతులు..
రైల్వే స్టేషన్లో మూడో నంబర్ ఫ్లాట్ఫారంపై టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని స్థానికులు వినతి పత్రం అందించారు. స్టేషన్ ఆవరణలో రుసుం లేకుండా ఆటో స్టాండ్ను ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ నాయకులు వినతి పత్రం అందించారు. బల్లార్షా నుంచి కాజీపేట్ రైలును హైదరాబాద్ వరకు పొడిగించాలని, అలాగే కాగజ్నగర్ నుంచి తిరుపతి వరకు నూతన రైలును ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. రైల్వే జీఎం వెంట మంచిర్యాల రైల్వే మేనేజర్ రామారావు, రైల్వే అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
మందమర్రి నవంబర్ 25 : మందమర్రి రైల్వేస్టేషన్లో సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్), టీబీజీకేఎస్ నాయకులు కో రారు. ఈ మేరకు శుక్రవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ప్రయాణికులకు తాగునీటి సౌక ర్యం కల్పించడంతో పాటు టికెట్ కౌంటర్, మందమర్రి పట్టణం వైపు ప్లాట్ఫామ్ను ఏ ర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే సింగరేణి, ప్యాసింజర్ రైళ్లను స్టేషన్లో ఆపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని, ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్), నాయకులు జే.రవీందర్, మేడిపల్లి సం పత్, బడికెల సంపత్, కొంగల తిరుపతిరెడ్డి, మద్దెల శంకర్, పెండ్రి రాజిరెడ్డి, బత్తుల శ్రీనివాస్, ఎండీ.అబ్బాస్, బర్ల సదానందం, మిట్ట సూర్యనారాయణ, మేడిపల్లి మల్లేశ్, మాసు వెంకటేశ్, కనకం రవీందర్, వనం నర్సయ్య, ముస్తఫా, ఎర్ర రాజు, పల్లె నర్సింగ్, మజార్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి స్టేషన్లో అభివృద్ధి పనులు ప్రారంభం
బెల్లంపల్లి, నవంబర్ 25 : బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను దక్షిణ మ ధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ ప్రారంభించారు. మహిళల విశ్రాంతి గది, ఓపెన్ జిమ్, పిల్లల పార్కు, లోకో పైలెట్ రన్నింగ్ రూం, డ్రైవర్స్, గార్డ్స్ రన్నింగ్ రూం ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్టేష న్ ఎదుట రైల్వే ఉన్నతాధికారులతో కలిసి మొ క్కలు నాటారు. జీఎంకు స్థానిక వ్యాపారులు, స్వచ్ఛంద సేవా సంస్థ్ధలు, రైల్యే ఉద్యోగుల కుటుంబాలు, రైల్వే యూనియన్ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని, రెండో ప్లాట్ ఫాంను విస్తరించాలని వ్యాపారులు వినతిపత్రం సమర్పించారు .రైల్వే ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలని, రైల్వే క్వార్టర్లలో సమస్యలను పరిష్కరించాలని సం బంధిత కుటుంబాలు, యూనియన్ నా యకులు విన్నవించారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
కాగజ్నగర్లో ఆగకుండానే వెళ్లిన జీఎం..
కాగజ్నగర్, నవంబర్ 25 : కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, మూడో లైన్ పనుల పరిశీలనకై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, పీసీఈఈ పీడీ మిశ్రా పర్యటన శుక్రవారం ఖరారైంది. అయితే ఆలస్యం కారణంగా కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో ఆగకుండానే మహారాష్ట్రలోని మానిక్గడ్ వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో సమస్యలు, పట్టణంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం, వివిధ సమస్యలు ఆ యన దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ జా గృతి జిల్లా కమిటీ, టీఆర్ఎస్, ఎంఐఎం, కార్మి క సంఘాల నాయకులు ఆయన కోసం స్టేషన్లో వేచి చూడగా వారికి నిరాశే కలిగింది. ఆయన రాకపోవడంతో కాగజ్నగర్ రైల్వే స్టేషన్ మాస్టర్ శివరావుకు వినతిపత్రం అందించారు.