కాగజ్నగర్ రూరల్, నవంబర్ 25: కాగజ్నగర్ పట్టణంలోని చారిగాం రోడ్ సమీపంలో డబుల్ బెడ్రూం పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గంలో మొదటి విడతలో 480 ఇండ్లు మంజూరు కాగా, 288 ఇండ్ల పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన 192 నిర్మాణాలను జనవరి 15 లోగా పూర్తి చేయాలని సూచించారు. వీరి వెంట తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.
ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఓట రు జాబితా సవరణ పై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26,27 డిసెంబర్ 3,4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లాలోని తహసీల్దార్లు , సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని, సంబంధిత నివేదికను అందించాలని ఆదేశించారు. కాగజ్నగర్ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉపకరణల పం పిణీ కార్యక్రమం లో డీఈవో అశోక్తో కలిసి పాల్గొన్నారు. క్యాంపులో 122 మందికి ఉపకరణాలు పంపిణీ చేసినట్లు అలింకో సంస్థ వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, డీఎంహెచ్వో ప్రభాకర్, అలింకో సంస్థ వైద్యులు, కో ఆర్డినేటర్ సత్తయ్య, సంబంధిత శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.