తలమడుగు నవంబర్ 25 : మండలంలోని సాయిలింగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి రాంకిషన్ ఆధ్వర్యం లో 150 మంది కార్యకర్తలతో కలిసి బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ సమక్షంలో టీఆర్ ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. శుక్రవారం లింగి గ్రామం లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాంకిషన్తో పాటు 150 మందికి టీఆర్ఎస్ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాతుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నద ని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజ లు నమ్మె పరిస్థితుల్లో లేరని తెలిపారు. రాంకిషన్ మాలీ సంక్షేమ సంఘం నాయకుడిగా సేవలందిం చారని, ఆయన రాకతో లింగి గ్రామంలో పార్టీ బలపడుతుందని గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పార్టీ నియోజక వర్గ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి, ఆశన్న యాద వ్, కంది నర్సిం హులు, అబ్దుల్లా, తోట ప్రమోద్, తోట అశోక్, శేవ్వ పొచ్చన్న, వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.