పశుసంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నిర్మల్ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ శంకర్ అన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు శంకర్
దిలావర్పూర్, నవంబర్ 22 : పశుసంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నిర్మల్ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ శంకర్ అన్నారు. మండలకేంద్రంలో మశూచి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గొర్రెల కాపరులు తమ జీవాలకు టీకాలు వేయించాలని సూచించారు.కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నందకుమార్, సర్పంచ్ వీరేశ్కుమార్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్దే అనిల్, రైతులు భోజన్న, చందు, గంగాధర్, మానిక్రావు, పోతన్న, ముత్యం, రాజశేఖర్ ఉన్నారు.