ఎదులాపురం, నవంబర్ 22 : ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెం పొందించేందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. పట్టణంలోని మసూద్నగర్ బాలాక్ మందిర్, హమీద్ పుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 62 పాఠశాలల్లో 3, 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, అంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞాన విషయాలపై ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు.
4వ తరగతి విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి జవాబులను రాబట్టారు. మధ్యాహ్న భోజనం, విద్యాబోధన వంటి విషయాలను అడిగి తెలుసు కున్నారు. వంట గదిని పరిశీలించారు. శుభ్రతను పాటించాలని, విద్యార్థులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈవో ప్రణీత, బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, తహసీల్దార్ శివరాజ్, సెక్టోరల్ అధికారి కంటె నర్సయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.