దిలావర్పూర్ నవంబర్ 22 : జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నామని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పేర్కొ న్నారు. దిలావర్పూర్లోని గ్రంథాలయాన్ని చైర్మన్తో కలిసి మంగళవారం ఆయన సందర్శిం చారు. ఈ సందర్భంగా భవన మరమ్మతు పనుల ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. యువతను పోటీ పరిక్షలకు ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనం తరం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, గ్రంథాలయ అధికారి సంజీవ్రెడ్డి, సర్పంచ్ వీరేశ్కుమార్, ఎంపీవో అజీజ్ఖాన్, పంచాయతీ ఈవో చంద్రశేఖర్, శ్రీనివాస్ నాయకులున్నారు.
వారంలోగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
సోన్, నవంబర్ 22 : యువత, విద్యార్థులు చదువుకునేందుకు వారంలోగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. సోన్ మండల కేంద్రంలోని మంగళవారం ప్రాథమిక పాఠశా లలో ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ గదులను పరిశీలించారు. వారంలోగా వివిధ రకాల పుస్తకా లు, పత్రికలు ఉంచేలా చూడాలని సూచించారు. గ్రంథాలయం వారంల్లోగా పూర్తి చేసి ఇస్తామని గ్రామ సర్పంచ్ వినోద్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీవో కలీం, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.