పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గతంలో ఇండ్ల నిర్మాణానికి కేటాయించి, అమ్మకుండా ఉన్న స్థలాన్ని ప్రజలకు అందుబాటు ధరలలో విక్ర యించింది.ఆదిలాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి-44కి సమీపంలో ఉన్న 29.34 ఎకరాల రాజీవ్ స్వగృహ స్థలాన్ని 362 ప్లాట్లుగా విభజించి, అగ్రజా టౌన్షిప్ పేరిట వేలం ద్వారా విక్రయాలు నిర్వహించారు. గజానికి కనీస ధర రూ.8 వేలు నిర్ణయించి ఆరు రోజుల పాటు అమ్మకాలు జరిపారు. రూ.8,100 నుంచి గరిష్ఠంగా రూ.16,800 వరకు ధర చెల్లించారు. అగ్రజా టౌన్షిప్లో 362 ప్లాట్లు అమ్ముడు పోగా.. ప్రభుత్వానికి రూ.97.14 కోట్ల ఆదా యం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, నవంబర్ 19 ( నమస్తే తెలంగాణ) : ప్రజల సొంతింటి కలను నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రంలో గతంలో రాజీవ్ స్వగృహాకు కేటాయించిన భూములను అభివృద్ధి చేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేపట్టింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 29.34 ఎకరాల భూమిలో అధికారులు అగ్రజా టౌన్షిప్ పేరిట 362 ప్లాట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 150 చదరపు గజాల సైజు ఉన్నవి 146, 200 చదరపు గజాలవి 104, 240 చదరపు గజాలవి 5, 266 చదరపు గజాలవి 52, వివిధ సైజుల్లో 55 ప్లాట్లను రూపొందించారు. లే ఆవుట్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. పేదలు, మథ్యతరగతి ప్రజలు ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థలం కొనుగోలు చేయాల్సి వారికి సందేహాలు తీర్చేలా అవగాహన కల్పించడంతో పాటు సైట్ ప్లాన్లను వారికి అందజేశారు. అధికారులు అగ్రజా టౌన్షిప్ స్థలాల విక్రయంలో భాగంగా తీసుకున్న చర్యల ఫలితంగా ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు.
జాతీయ రహదారి పక్కన 29.34 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అగ్రజా టౌన్ షిప్లో ప్లాట్ల విక్రయాలు ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు రూ.10 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉండగా, 800 వరకు స్థలం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. పోటీ ఎక్కువగా ఉండడంతో వేలం పాటను శుక్రవారంతో ముగించాల్సి ఉండగా, శనివారం సైతం కొనసాగాయి. ఆరు రోజుల పాటు జరిగిన వేలంలో ప్రజలు తమకు న చ్చిన పాట్లను దక్కించుకున్నారు. ప్రభుత్వం గజానికి కనీస ధర రూ.8 వేలు నిర్ణయించగా బిడ్డర్లు కనీసంగా రూ.8100 ఎక్కువగా రూ. 16,800 చెల్లించి కొనుగోలు చేశారు. తూర్పు, ఉత్త రం ముఖం ఉన్న ప్లాట్లకు ఎక్కువ ధరకు అమ్ముడుపోగా, దక్షి ణం, పడమర ముఖం. వీధిపోటు ఉన్న స్థలాలకు అంతగా ధర రాలేదు. టౌన్షిప్లో మొత్తం 362 ప్లాట్లకు గానూ రూ. రూ.97.13 కోట్లు సమాకూరాయి. కొనుగోలు దారులకు వేలం అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందించారు. స్థలాలు దక్కించుకున్న వారు 90 రోజుల్లో మొత్తం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ప్లాట్ల విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పర్యవేక్షించారు.