కడెం, నవంబర్ 11 : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సమక్షంలో శుక్రవారం కడెం మండలంలోని ఎలగడప, ధర్మాజిపేట గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. స్థానిక హరిత రిసార్ట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 100 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే చిన్నబెల్లాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. అలాగే పెద్దబెల్లాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) కార్యకర్త కొత్తకొండ భాస్కర్గౌడ్ ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆ తర్వాత మండలంలోని పలు గ్రామాలకు చెందిన దండారీ బృందాలకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 17 బృందాలకు రూ.10 చొప్పున అందించిట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు ఆకుల బాలవ్వ, రమాదేవి, శ్రీకాంత్యాదవ్, కొండపురం అనూష, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజేశ్వర్గౌడ్, నాయకులు స్టీఫెన్, రాపర్తి లక్ష్మణ్, నర్సింగ్ రమేశ్, మల్లేశ్, సురేందర్, సన్నీ, కుమ్మరి రంజిత్, మల్లారెడ్డి, సత్తన్న, మల్లేశ్, తక్కళ్ల సత్తన్న, ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.