ఎదులాపురం, నవంబర్ 11 : సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను తెలంగాణలో స్థాపించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారి గూడ మైనార్టీ గురుకులంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మైనార్టీల్లో మార్పు దిశగా ప్రత్యేక దృష్టిట్టి, మొట్టమొదటి సారిగా తెలంగాణలో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. నేడు బంగారుగూడలో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులం సత్ఫలితాలు ఇస్తున్నదన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకొని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, నాయకులు సాజీదుద్దీన్, పట్టణ కార్యదర్శి అష్రఫ్, సమీర్ ఉల్లా, షేక్ సలీం, ఎజాజ్, ఈశ్రార్, గురుకులం ప్రిన్సిపాలు రజిని, ఉపాధ్యాయులు పల్లవి, స్వరూపారాణి పాల్గొన్నారు.
శిక్షణ ప్రారంభం..
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫిజికల్ టెస్ట్ ఉచిత శిక్షణను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా రన్నింగ్ను జెండా ఊపి ప్రారంభించారు. షార్ట్పుట్, త్రో బాల్, లాగ్ జంప్ క్రీడల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు నారాయణ, సమీర్ఉల్లా, కౌన్సిలర్ అశోక్ స్వామి, నాయకులు రామ్ కుమార్ పాల్గొన్నారు.