భైంసా, నవంబర్ 11 : సీఎం కేసీఆర్ కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పిప్రి ప్రాథమిక పాఠశాలకు రూ.61 లక్షలు మంజూరవగా, శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంగా ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, కౌన్సిలర్ చందులాల్, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి రమణారావు, ఉద్యోగ సంఘాల నాయకులు రమణారావు, భూషణ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీ గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, సూర్యనారాయణ, ఆళా, ఎంఈవో సుభాష్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన మహేశ్ అనారోగ్యానికి గురవగా, సీఎంఆర్ఎఫ్ కింద రూ.లక్ష మంజూరైంది. కాగా, స్థానిక విశ్రాంతి భవనంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, గణేశ్, దేవిదాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోపాల్ నగర్ పిప్రి కాలనీలో మిషన్ భగీరథతో పాటు, రోడ్డు, డ్రైనేజీలను ఎమ్మెల్యే పరిశీలించారు.