మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 3 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనకు వేళయ్యింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆన్లైన్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే తరగతి గదులు, సెంట్రల్ లైబ్రరీ, చాంబర్స్, ల్యాబ్లు సిద్ధం చేసిన యంత్రాంగం, ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి చొరవతో వైద్య విద్య కల నెరవేరబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. – మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 3
మంచిర్యా ల జిల్లాకేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యకు వేళయ్యింది. గతంలో వైద్య విద్యనభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకో వెళ్లాల్సి వ చ్చేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదని ఆలోచనతో రాష్ట్ర వ్యా ప్తంగా అవసరమైన చోట మెడికల్ కళాశాలలను కేటాయించారు. ఇందులో భాగంగా కో ల్బెల్ట్ ప్రాంతమైన మంచిర్యాల జిల్లాకు కళాశాలను మంజూరు చేయగా, వైద్య విద్య మన చెంతకు చేరువ అయ్యింది.
యుద్ధప్రాతిపదికన పనులు
ఈ నేపథ్యంలో పట్టణంలోని మార్కెట్ యా ర్డులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు యు ద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. తొందర్లోనే నిర్మాణం పూర్తవ్వడంతో కళాశాల అనుమతే ఇక ఉండే. చివరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎంసీ బృందం కళాశాలను సందర్శించి మా ర్కెట్ యార్డు గోదాముల్లోని రేకుల షెడ్డులో నిర్మించినందుకు అనుమతులను నిరాకరించింది. దీంతో పెద్దపెల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఢిల్లీ కి వెల్లి అక్కడ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ను కలిసి కళాశాలలో తరగతులు, వసతులు, ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు జిల్లా, మహారాష్ట్ర పేద ప్రజలకు వైద్య అవసరాల అందుబాటులో ఉంటాయని వారి దృష్టికి తీసుకవెళ్లడంతో చివరకు స్పందించి మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్త్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.
ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభం..
నీట్ మొదటి విడుత కౌన్సెలింగ్లో భాగంగా 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించగా, ఆ సమయానికి అనుమతులు రాకపోగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తరగతులకు అనుమతినివ్వడంతో రెండో కౌన్సెలింగ్లో భా గంగా మంచిర్యాల వైద్య కళాశాలకు 100 సీట్లను కేటాయించి ఆన్లైన్ అడ్మిషన్లను ప్రా రంభించింది. ఇందులో 85 శాతం రాష్ర్టానికి సంబంధించి ఉండగా, మిగితా ఆల్ ఇండి యా కోటాకు సంబంధించిన 15 శాతం సీట్ల తో పూర్తి ఆన్లైన్ అడ్మిషన్లకు ఎన్ఎంసీ ఒకే చెప్పింది. ఒకవేళ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన సీట్లోలో ఏవైనా మిగిలితే అవి స్టేట్ కోటా కిందకు మార్చి సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ తేదీలను ఖరారు చేస్తారు. కళాశాల వివరాల కోసం తాత్కాలికంగా నోడల్ అధికారి డా.జితేందర్ను నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దావుద్ సులేమాన్ తెలిపారు. విద్యార్థులు అడ్మిషన్, సంబంధిత వివరాల కోసం సెల్ నంబర్ 970416 9469 సంప్రదించాలని సూచించారు.
62 మంది ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు..
ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్లో భాగంగా ఒక ఆర్ఎంవో, ఒక సీఏఎస్, 16 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, 41 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులను నియమించింది. దీంతో జిల్లా ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య అమాంతం పెరిగింది. మెడికల్ కళాశాలలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో తరగతి గదులు, సెంట్రల్ లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, మెడికల్ ల్యాబ్ల నిర్మాణం సిద్ధంగా ఉన్నాయి.
అతి కొద్ది సమయంలోనే ..
మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు అతి కొద్ది సమయంలోనే పూర్తి చేసింది.వసతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిశీలించి తరగతుల నిర్వహణకు అనుమతులను మంజూరు చేసింది. దీంతో అతి త్వరలోనే మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానున్నది.
నమస్తే తెలంగాణ పత్రిక ప్రముఖ పాత్ర..
మెడికల్ కళాశాల నిర్మాణం మార్కెట్ యార్డ్ గోదాముల్లో, రేకుల షెడ్డులో నిర్మించినందుకే నేషనల్ వైద్య కమిషన్ కళాశాలకు అనుమతిని నిరాకరించినందని తెలియగానే చాలామంది నిస్సహయానికి గురైయ్యారు. ప్రజాప్రతినిధులకు తోడుగా ‘నమస్తే ’ తన కథనం ద్వార ‘సూస్తే రేకుల షెడ్డు లోపల కండ్లు చెదిరిపోయే వసతులు’ అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో కథనానికి స్పందించి కళాశాలకు అనుమతులు వచ్చేలా ప్రముఖ పాత్రను పోషించింది. త్వరలోనే తరగతులు ప్రారంభం కాను న్న వేళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కల నెరవేరింది…
మంచిర్యాలకు మెడికల్ కళాశాల మం జూరు చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, కలెక్టర్ భారతీ హోళికేరీకి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలు మంజూరు చేసినా తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించింది. సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యేక చొరవ తీసుకొని మంచిర్యాల జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. తరగతు లు, ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అమోదం తెలపడం ఆనందాన్నిచ్చింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటుతో మా ప్రజల కలతో పాటు నా చిరకాల తృప్తినిచ్చే కోరిక కూడ నెరవేరింది.
–నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే