ఉట్నూర్, నవంబర్ 3 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో గోండి భాషా సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐటీడీఏ సంయుక్తంగా నిర్వహించిన గోండి, తెలుగు అనువాద కార్యశాల మూడు రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గోండు భాషా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రత్యేకమని అన్నారు. జనజీవనం, సాహిత్య, సంస్కృతిని ఆధునిక పద్ధతుల్లో అనువాద రూపంలోకి తీసుకురావాలన్నారు. గోండి భాష అనువాద పుస్తకాలు పంపిణీ చేసి విద్యార్థుల్లో అక్షరాస్యతను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రపంచ దేశాల చరిత్ర, సైన్స్ వంటివి నేడు అనువాద రూపంలో అందుతున్నాయని తెలిపారు. 16 గోండి తెలుగు అనువాద పుస్తకాలు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల అనువాద వర్క్షాప్ నిర్వహణకు పూర్తి సహాయ, సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, అనువాద కర్తలు ఆర్క మాణిక్రావ్, తొడసం దేవ్రావ్, వినాయక్రావ్, మడావి సంగీత, ఇందిరా, వసంత్రావ్, దేశ్పాండే, సురేశ్, శర్మ, చైతన్య, నీరజ, తదితరులు పాల్గొన్నారు.
పీవోను కలిసిన ఆదివాసీ నాయకులు
ఇచ్చోడ(సిరికొండ), నవంబర్ 3 : సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని మండల ఆదివాసీ నాయకులు గురువారం ఉట్నూర్లో ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన రిమ్మ గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సర్పంచ్లు అనిల్, రఘురాం, ఆదివాసీ నాయకులు బాబురావ్ ఉన్నారు.