కుంటాల, నవంబర్ 3 : ఆలయాల అభివృద్దికి దేవాదాయ శాఖ నుంచి రూ.18 లక్షల మంజూర య్యాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని విఠాపూర్ గ్రామం లో ముత్యాలమ్మ, మహాంకాళి, మహాలక్ష్మీ ఆల యాల పునరుద్ధరణకు రూ. 18 లక్షలు మంజూ రు కాగా గురువారం గ్రామస్తులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఆలయాల అభివృద్ధ్దికి ప్రభుత్వం భారీగా నిధుల విడుదల చేస్తున్నదని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమా నికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి అల్లోల కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని విఠాపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ గల్లాపురం లక్ష్మీ రమేశ్, వీడీసీ అధ్యక్షుడు అశోక్, నాయకులు విఠల్ రావు, సుదర్శన్రెడ్డి, ఇంద్రారెడ్డి, పరశురాం, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అందకూర్ గ్రామా నికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి చెక్కుల ను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. షేక్ అలీం కు రూ. 32 వేలు, షేక్ మౌలానికి రూ. 16 వేలు మంజూరయ్యాయి. సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీ టీసీ మధు, వీడీసీ అధ్యక్షుడు భోజన్న, నాయ కులు శ్రీశైలం, నవిన్, గంగాధర్ ఉన్నారు.
లోకేశ్వరం, నవంబర్ 3 : మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన దండారం దేవు బాయి మక్కాజీకి రూ. 49,500 విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అతిథి గృహంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అందకూర్ సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీటీసీ దాసరి మధు, ఆత్మ డైరెక్టర్ బూమన్న, ఏలేటి ఇంద్రారెడ్డి, నాయకులు, పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 3 : మండలంలోని పార్డి(కే) గ్రామంలోని హనుమాన్ మందిరంలో కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి గ్రామ స్తుల తరఫున టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే నివాసం దేగాంలో ఆయనను కలిసిన రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు దొంతుల సాయన్న, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ఎగ్గం సాయినాథ్ సంఘం భవన నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందించారు.