ఎదులాపురం, నవంబర్ 3 : తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాళ్ల విఠల్, శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో నాయకులతో కలిసి గురువారం వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాలూకా మున్నూరు కాపు సంఘం గ్రామ, పట్టణ వార్డు కమిటీల అధక్ష కార్యదర్శులతో ఈ నెల 4వ తేదీన ఆర్థిక లావాదేవీలపై సమావేశం, 12న సాయంత్రం 5 గంటలకు సంఘంలో కార్తీక దీపాత్సవం ఉంటుందని పేర్కొన్నారు. పూజకు కావాల్సిన సామగ్రి ఉచితంగా నాయకులు అందిస్తారన్నారు. 13న ఉదయం 10 గంటలకు ఇటీవల ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కోశాధికారి జైపాల్, సభ్యులు ప్రభ, మమత, కారింగుల శైలజ, ముద్దం పద్మ, జోగు రమణి, రమ, శంకర్, గంట సురేశ్, మోహన్, వేణు, దేవేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 3 : శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఈ నెల 7వ తేదీన సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి మాధవ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాల కృష్ణామఠంలో దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు పూజ సామగ్రి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు సూర్యకాంత్, సంతోష్, శ్రీనివాస్, మహి ళా సభ్యులు మాలతి, స్వప్న, కృష్ణవేణి, పద్మావతి, కల్యాణి, ప్రేమల, బాబితా పాల్గొన్నారు.