మామడ, నవంబర్ 3 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. న్యూసాంగ్వీ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొను గోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2060 బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2040 మద్దతు ధర చెల్లిస్తుందని పేర్కొన్నారు.
రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కమల్కోట్ గ్రామానికి నూతనంగా సబ్స్టేషన్ మంజూరు చేశామని పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సర్పంచ్ సుజాత, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్ కుమార్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్ల వెంకట్రాంరెడ్డి, ఆర్డీవో తుకరాం, డీఏవో అంజి ప్రసాద్, డీసీవో శ్రీనివాస్ రెడ్డి, డీఎం శ్రీలేఖ, డీసీఎస్వో తనూజ, తహసీ ల్దార్ ఆరిఫా, ఏవో నాగరాజు, ఏఈవో సృజిత, కమల్కోట్ సర్పంచ్ ముత్యంరెడ్డి, ఎంపీవో గోవర్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి, నాయకులు గంగాధర్, శశికాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 3 : నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో రైతులు పండించిన వరిధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం వరిధాన్యం కొను గోళ్ల నిర్వహణపై ముథోల్, ఖానాపూర్ ఎమ్మె ల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నిర్మల్ జిల్లాలో సుమారు లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ కొను గోలు కేంద్రాల్లో లక్షా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా నిర్ణయించామని పేర్కొన్నారు.
మొత్తం 192 కేంద్రాలను ఏర్పాటు చేసి వారంలోగా అన్ని మండలాల్లో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి రూ. 2060 ధర ప్రకటించిందని రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్ర యించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటవెంటనే తరలించా లని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సౌక ర్యాలు కల్పించాలని, సరిగా తూకం వేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంక ట్రామ్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డీఎస్వో తనూజ, డీఎం శ్రీకళ, డీసీవో శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్, మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్, ఆర్టీవో అజయ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 3 : నిర్మల్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తనూజ గురువారం మర్యాదపూర్వకంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మిని వేర్వేరుగా కలుసు కొని పుష్పగుచ్ఛం అందించారు. డీఎం సివిల్ సప్లయ్ మేనేజర్ శ్రీకళ, సిబ్బంది ప్రకాశ్, పంచపూల, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.