ఆదిలాబాద్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో సోయా సాగైం ది. వానకాలం ఆరంభంలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంటలు మునిగాయి. అనంతరం వాతావరణం అనుకూలించడంతో దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు, ఎరువుల వాడకం, మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వానకాలం ముగుస్తుందని అనుకున్న సమయంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు దిగుబడులపై ప్రభావం పడేలా చేస్తున్నాయి. పంటలు కోత దశలో ఉండగా ఎండలు అవసరం కాగా.. వ ర్షాలు కురుస్తుండడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రారంభం కాగా.. పంటను అమ్ముకునే పరిస్థితుల్లో వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
అకాల వర్షాలతో నష్టం..
జిల్లాలో పత్తి, సోయా దిగుబడు లు ప్రారంభమయ్యాయి. కొందరు రైతులు సోయా కోసి కుప్పలుగా వేయగా.. మరికొందరు హార్వెస్టర్లతో పంటను తీస్తున్నారు. జిల్లాలో వారం రోజులుగా ఉరుములు, మెరుపులతో కూ డిన వర్షాలు పడుతున్నాయి. సోయా కుప్పులు తడిసిపోతుండగా, కోయని పంట నల్లబారి నాణ్య త దెబ్బతింటున్నది. దూది విచ్చుకునే దశలో ఉన్న పత్తి ఎండలు లేకపోవడంతో కాయ లు పగలడం లేదు. వర్షాల కారణంగా తేమ ప్రభావంతో కాయలు నల్లబారి నేలపై పడిపోతున్నా యి. ఇప్పటికే విచ్చుకున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పంటకు తక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. సోయా కూడా నాణ్యత లేకపోవడంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదు.జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతు లు పత్తి, సోయా పంటలను నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.
అధిక వర్షాలతో నష్టం..
నేను 15 ఎకరాల్లో పత్తి వేశా. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట దిగుబడిపై తగ్గుతుందని భావిస్తున్నా. ఏపుగా పెరగాల్సిన పత్తి పంట పెరగలేదు. అధిక వర్షాలకు కాత, పూత రాలిపోవడంతో కాయలు కాలేదు. ఉన్నటువంటి కాయలు కూడా ఎండిపోవడం, మురిగిపోవడం జరుగుతున్నది. ఒక్కో చెట్టుకు 5-10 కాయలు మురిగి పోయాయి. మొదట ఏరినప్పుడే పత్తి మంచి బరువు ఉండి, దిగుబడి కూడా వస్తుంది. కానీ.. ఇప్పుడు రైతులకు ఆదిలోనే దెబ్బ తగిలింది. సగటున ఎకరాకు రెండు క్వింటాళ్ల పత్తి నష్టపోవాలి వస్తున్నది.
– కంది గోవర్ధన్రెడ్డి, రైతు, తాంసి
నిండాముంచిన వానలు..
నేను ఎనిమిదెకరాల్లో పత్తి వేశా. అల్పపీడన ప్రభావంతో పది రోజులు ఏకధాటిగా వానలు పడ్డాయి. గతంలో ఇలా వర్షాలు ఎప్పుడు కురవలేదు. పత్తికి బాగా నష్టం వాటిల్లేట్టుగా ఉంది. సోయా వేసిన రైతులు పరిస్థితి కూడా దుర్భరంగా ఉంది. సోయా కోసిన రైతులు ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధిక వర్షాలకు సోయా తడిసి రంగుమారి, బూజు పడుతున్నాయి. దీంతో రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. ఈ యేడు వర్షాలు రైతులను నిండాముంచాయి.
– కారం దేవదాస్, రైతు, జామిడి