దండేపల్లి, అక్టోబర్23 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున ఉన్న పద్మల్పురి కాకో(ఏత్మాసూర్) ఆలయంలో ఆదివారం నిర్వహించిన గుస్సాడీ దర్బార్కు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్రం నుంచేగాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి గోండ్, ప్రధాన్, కోలాం, తోటి, తదితర ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చారు. మొదట గోదావరి పవిత్ర జలాలను కాకో వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పవిత్రమైన కానుగ నూనెతో తయారు చేసిన గారెలను నైవేద్యం గా అందించారు. కొత్తగా పెళ్లయిన జంటలను అమ్మవారి ముందు భేటీ ఉంచారు. కొత్తకోడళ్లను అమ్మవారికి పరిచయం చేయించారు. అనంతరం సామూహికంగా విందు భోజనాలు ఆరగించారు. దండారీ, గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆటపాటలతో ఆలయ ప్రాం గణం మారుమోగింది. దండారీ వేడుకలకు సంబంధించిన చెక్కులను గుస్సాడీ బృందాలకు ఐడీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అందించారు. అంతకుముందు కాకో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పిలుపునిచ్చారు. గుస్సాడీ దర్బార్కు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పద్మల్పురి ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.36 లక్షలు మంజూరు చేసి, ఆలయం అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు జోడేఘాట్ను పర్యాటకంగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని కొనియాడారు. యువత ఉన్నత చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గిరిజనులను గుర్తించామన్నారు. ఇటీవల వరదలకు ఆలయం పరిసరాలు దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు, డీటీడీవో నీలిమా, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బియ్యాల తిరుపతి, ఆలయ చైర్మన్ కుడిమెత సోము, మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, రాయి సెంటర్ జిల్లా సభ్యుడు పెందురు రాంపటేల్, తుడం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పుర్క బాపురావు, పర్ధాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు అడాయి కాంతారావు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కన్నాక జంగు, ఆదివాసీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
సల్పాల వాగు సమీపంలో..
దేవాపూర్లోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి ఆలయం వద్ద ఆదివాసీలు దం డారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు హాజరై ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం అక్కడున్న వారితో నృత్యం చేసి ఉత్సాహ పరి చారు. పలు గ్రామాల నుంచి దండారీలు తరలివచ్చి ప్రదర్శన ఇచ్చారు. అనంతరం దండారీ దర్బార్ నిర్వహించి ఆదివాసీ సమస్యలపై చర్చించారు. కార్య క్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, మడావి అనంతరావు, సిడం గణపతి, ఆడె జంగు, ఆడె బాదు, మడావి వెంకటేశ్, పెంద్రం హన్మంతు, శంకర్, అగ్గి సత్తయ్య, బానోత్ రాజేశ్, వేణు పాల్గొన్నారు.