భీంపూర్, అక్టోబర్ 22 : గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పన, అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నదని, క్షేత్రస్థాయిలో సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతో మేల ని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ అన్నారు. భీంపూర్ మండల ప్రజాపరిషత్ ఆవరణలో శనివారం ఉదయం నుంచి సాయం త్రం వరకు ప్రజావేదిక నిర్వహించారు. ఇందులో 26 గ్రామపంచాయతీలు, అనుబంధ గ్రామాలకు సంబంధించి మూడేండ్ల్లకాలంలో రూ.12 కోట్ల అంచనాతో నిర్వహించిన వివిధ ఈజీఎస్ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ నివేదికలు చదివి వినిపించారు.
ఈ మొత్తం పనులకు సంబంధించి ఎక్కడైనా తేడా కనిపిస్తే బాధ్యులపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. అవకతవకలకు పాల్పడిన నిధులను రికవరీ చేస్తామని స్పష్టంచేశారు. ఏ పథకంలోనైనా నిధులు దుర్వినియోగమైతే సమాజం తీవ్రంగా నష్టపోతుందన్నారు. అంత ర్గాం, టేకిడి రాంపూర్, దనోరా, గొల్లఘడ్ గ్రామాల్లో ఏండ్ల క్రితమే చనిపోయిన వారి పేరిట ఉపాధి పనులు చేయించినట్లు ఆడిట్లో తేలిందన్నారు. ఈ వేదికలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీడీ రవీందర్, ఏపీవో సంగీత, అసిస్టెంట్ పీడీ సిద్ధిఖీ, విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్, ఎంపీవో వినోద్, ఎస్ఆర్పీ జీవన్, ఈసీ నరేందర్, టీఏలు, ఎఫ్ఏలు, కార్యదర్శులు, సర్పంచులు పెండెపు కృష్ణ, అజయ్, కరీం, అజ య్, లింబాజీ, నాయకులు జీ నరేందర్యాదవ్, కపిల్, వైభ వ్, రమేశ్, సంతోష్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 22 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా తాంసి మండల కేంద్రంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదికలను వెల్లడించారు. ఈ క్రమంలో సమావేశం వాడీవేడిగా సాగింది. 2018 నుంచి 2022, మార్చి 31 వరకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. మొత్తం 13 గ్రామ పంచాయతీలుండగా.. ప్రతి గ్రామానికి చెందిన నివేదికలను వెల్లడించారు. మండలంలోని ఘోట్కూరిలో మట్టిరోడ్లు మిషన్లతో చేపట్టి లేబర్లతో చేసినట్లు చూపించి లక్షలాది రూపాయలు స్వాహా చేశారని ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామంలో చెరువులు లేకున్నా ఉన్నట్లు చూపించి పెద్దమొత్తంలో బిల్లులు స్వాహా చేశారని ఆరోపించారు. దాదాపు రూ.20 లక్షల వరకు ఎలాంటి పనులు చేయకున్నా నిధులు అక్రమంగా సంబంధిత నాయకులు లేపుకున్నారని డీఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. పలువురు రైతుల చేలలో పనులు చేయకున్నా చేసినట్లు చూపి బిల్లులు కాజేశారని ఉపాధిహామీ కూలీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పనికి వెళ్లనివారికి సైతం హాజరు వేసి అక్రమంగా కూలి పొందుతున్నారని మండిపడ్డారు. అనంతరం డీఆర్డీవో మాట్లాడుతూ.. ఈ విషయాలను రికార్డు చేసుకున్నామని, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేసి తనిఖీ చేపడుతామని హామీ ఇచ్చారు.
అక్రమంగా బిల్లులు పొందినట్లు తేలితే మాత్రం రికవరీ చేస్తామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ రవీందర్ రాథోడ్, డీఆర్పీ భగవంత్రావ్, ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఏపీవో విజయ, సర్పంచులు కృష్ణ, వెంకన్న, సదానందం, కేశవ్రెడ్డి, శంకర్, భరత్, గజానన్, ఉపాధిహామీ అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.