ఏరియా కార్యక్రమాల్లో పాల్గొన్న జీఎంలు, ఇతర అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాల సభ్యులు స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేళా.. నల్లనేలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలను సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం, అధికార గణం, కార్మికలోకం ఘనంగా నిర్వ హించుకోంది. గనులు, ఓసీపీలు, కార్మిక కాలనీల కూడళ్లు, యూనియన్ కార్యాల యాలు..ఇలా అన్నింటా సంబురాలు నిర్వహించ గా, జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. దేశాభివృద్ధితో పాటు సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకి తం కావాలని ఈ సందర్భంగా ఆయా ఏరియాల జీఎంలు పిలుపునిచ్చారు.
శ్రీరాంపూర్, ఆగస్టు 15: త్యాగాల ఫలమే భారత స్వాతంత్య్రమని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సంస్థ ఘనంగా నిర్వహి స్తున్నదని చెప్పారు. దేశాభివృద్ధితో సంస్థ అభివృద్ధి కి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపుని చ్చారు. సింగరేణి పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టీబీజీకేఎస్ ఏ రియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాధర్, ఎస్వోటూజీ ఎం గోపాల్సింగ్, డీవైజీఎంలు సత్యనారాయణ, ఏవీ రెడ్డి, ఏజీఎం మురళీధర్, ఈఈ చంద్రశేఖర్, గో విందరాజు, ఏఎస్వో గోసిక మల్లేశం, డాక్టర్ రమేశ్ బాబు, ఏరియా చర్చల ప్రతినిధులు కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, తదితరులున్నారు..
శ్రీరాంపూర్ ఓసీపీపై పీవో పురుషోత్తంరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు సమష్టిగా కృషి చేసి ఓసీపీ లక్ష్యాలు సాధించాలని కోరారు. ఓసీపీ కార్మికుడు చంద్రయ్య కూతురు ఎంబీబీఎస్ సీటు సాధించగా, కార్మికులతో కలిసి రూ.40 వేల సాయం అందించారు. మేనేజర్ జ నార్దన్, టీ బీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మల్లారె డ్డి, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, వెల్ఫేర్ ఆఫీసర్ శంక ర్, అధికారి శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఆర్కే 5గనిపై గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్ జాతీ య జెండా ఆవిష్కరించగా, సేఫ్టీ ఆఫీసర్ శివ య్య, సీనియర్ పీవో రణదీప్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శులు మహేందర్రెడ్డి, సత్యనారాయణ, నీలం సదయ్య, అధికారులు పాల్గొన్నారు. ఆర్కే 6గనిపై మేనేజర్ తిరుపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఏరియా చర్చల ప్రతినిధి కుమారస్వామి, పోశెట్టి, సేఫ్టీ ఆఫీసర్ సునీల్కుమార్, నా యకులు మల్లేశం, శ్రీనివాస్, అన్వేశ్, భీమయ్య, వెంకటరాజం పాల్గొన్నారు. ఎస్సార్పీ 3గనిపై మేనేజర్ సంతోష్కుమార్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి వే డుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి, ఈఈ మ హేందర్, సీనియర్ పీవో మోహన్సింగ్ పాల్గొన్నా రు. శ్రీ రాంపూర్లోని కోల్ లోడింగ్, అన్లోడింగ్ వర్క ర్స్ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి ఏను గు రవీందర్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరిం చారు. కోల్ లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు పీ మల్లయ్య, ప్ర ధాన కార్యద ర్శి అమరగొండ భీరయ్య, సహాయ కార్యదర్శి బీ రాజేశం, ఆర్గనైజర్ కుర్రె లింగయ్య, నామాల మల్లయ్య, ఆకుల రమేశ్ పాల్గొన్నారు.
జైపూర్: జైపూర్ ఎస్టీపీపీ ఆవరణలోని ఆడ్మిన్ బిల్డింగ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో సీటీసీ సంజయ్కుమార్ జెండా ఎగురవేశారు. అనంతరం ఉ త్తమ ఉద్యోగులను సన్మానించారు. సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ వెలుగులు అందిస్తున్నట్లు తెలిపారు. జీఎం శాస్త్రి, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జైన్సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, ఆగస్టు 15: టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోదావరి కాలనీ షిర్కే యూనియన్ కా ర్యాలయం వద్ద ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించా రు. కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారె డ్డి, వెంగళ కుమారస్వామి, తొంగల రమేశ్, జగదీశ్వర్రెడ్డి, రిక్కుల గోపాల్రెడ్డి, పీవీ రావు, ఎంబ డి తిరుపతి, రావుల అనిల్ పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, అగస్టు 15: స్థానిక జీఎం కార్యాలయంలో ఎస్అండ్పీసీ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జీఎం చింతల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ సా ధించిన ప్రగతి, ఏరియాలో సాధించిన విజయా లను వివరించారు. అనంతరం ఉత్తమ కార్మికుల ను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సేవా అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివా స్, ఎస్వోటూ జీఎం కృష్ణారావు, టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు ఎం. సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పీ ఎం వరప్రసాద్, ఏజీఎం (ఎఫ్ఆండ్ఏ) చక్రవర్తి, ఏజీఎం ఏజేంట్ కేకే గ్రూప్ రాంచందర్, ఏజీఎం ప్రాజేక్టు అధికారి వెంకటేశ్వర్లు, ఏజీఎం (ఈఅం డ్ఎం) రాంమూర్తి, తదితరులున్నారు.
రామకృష్ణాపూర్, ఆగస్టు 15 : ఆర్కే1ఏలో గని మేనేజర్ శ్రీధర్రావు, ఆర్కే ఓసీపీలో పీవో మధుసూదన్, సీహెచ్పీలో డీజీఎం బాలాజీ భగవతీ ఝా, ఆర్కేపీ సివిల్ కార్యాలయంలో ఎస్.ఈ రవికుమార్, ఏరియా దవాఖానలో డీవై ఏసీఎంవో డా. ఉష, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆర్కేపీ సీహెచ్పీలో జే శ్రీనివాస్, ఆర్కే ఓసీపీ గని ఆవరణలో కే. రాజ్కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. నాయకులు గాండ్ల సమ్మయ్య, ఎండీ యాకూబ్ అలీ, ఆసాల రాజన్న, గోపు రాజం పాల్గొన్నారు.
గోదావరిఖని, ఆగస్టు 15: ఆర్జీ-1 జీఎం కా ర్యాలయంలో జీఎం కే.నారాయణ మహాత్మాగాం ధీ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవా అధ్యక్షురాలు పద్మా నారాయణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మి ర్యాల రాజిరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దా మోదర్, సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనగోటి శ్రీనివాస్ గాల్లోకి త్రివర్ణ బెలూన్లు వదిలారు. ఎస్ అం డ్ పీసీ సిబ్బంది పరేడ్ నిర్వహించగా జీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ఆర్జీ-1 సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 9 మంది ఉత్తమ ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సింగరేణి పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ క్విజ్ పోటీల్లో విజేతలు, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ తీసిన అజహర్, కోలిండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో వెండి పతకం సాధించిన జీ.రాజయ్యకు బహుమతులు అందజేశారు. ఎస్వోటూ జీఎం రాంమోహన్, అధికారు లు చిలుక శ్రీనివాస్, చంద్రశేఖర్, కేవీ రావు, రా మకృష్ణ, లక్ష్మీనారాయణ, రాజం, నవీన్, సలీం, సారంగపాణి, శ్రావణ్కుమార్, ఆంజనేయ ప్రసా ద్, అభిలాష్, సేవా సభ్యులు తదితరులున్నారు.
రామగిరి, ఆగస్టు 15: ఆర్జీ-3, ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ జీఎం కార్యాలయం ఆవరణ లో, ఆఫీసర్స్ క్లబ్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం ప్రసంగిం చా రు. స్వాతంత్య్ర పోరాటం, దేశం, సంస్థ సాధిం చి న ప్రగతిని వివరించారు. అనంతరం ఉత్తమ ఉ ద్యోగులను సన్మానించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, అధికారులు ఎం.నరేందర్, రఘుపతి, రాజశేఖర్ రెడ్డి, ఎలీషా, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, రమేశ్, శ్రీనివాసులు, విలాస్ శ్రీనివాస్, తదితరులున్నారు.
యైటింక్లయిన్కాలనీ, ఆగస్టు 15: స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆర్జీ-2 జీఎం టీ. వెంకటేశ్వ ర్రావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించా రు. సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగ రేణి కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి, ఏరియాలో సాధించిన ప్రగతిని వివరిం చారు. ఆనంతరం ఉత్తమ కార్మికులను సన్మా నించారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదిం చిన యూ ట్యూబర్ సయ్యద్ హఫీజ్ను సన్మా నించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య, అధికార ప్రతినిధి జీ. రాజేంద్ర ప్రసాద్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, గుర్తింపు కార్మిక సంఘం డివిజన్ ఉ పాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారి మో హన్ రెడ్డి, ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వర్క్ షాప్ డీజీఎం ఎర్రన్న, డీజీఎం(సీ) ధనుంజయ్, రెస్క్యూ మేనేజర్ మాధవరావు, డీజీఎం(ఐఈడీ) మురళీకృష్ణ, సెక్యూరిటీ అధికారి పీవీ రమణ సీ నియర్ పీవోలు వేణుగోపాల్, మందల శ్రీనివాస్, ఓంకారిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన చీరాల ప్రసాద్ (ఈపీ ఆపరేటర్ ఓసీపీ-3), వెన్నం సురేశ్ (మో టర్ మెకానిక్ ఓసీపీ-3), కచ్చకాయల శ్రీనివాస్ (ఎస్డీఎల్ ఆపరేటర్ వీకేపీ), అలిశెట్టి రమేశ్(బదిలీ వర్కర్, వీకేపీ) వర్ష రాజ్కుమార్(చార్జ్హ్యాండ్, సీ హెచ్పీ ఓసీపీ-3)ని జీఎం సన్మానించారు.
రెబ్బెన, ఆగస్టు 15: బెల్లంపల్లి ఏరియాలోని గో లేటి జీఎం కార్యాలయంలో సోమవారం స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఉన్నత పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అనం తరం గోలేటి కార్యాలయంలో జాతీయ జెండాను జీఎం దేవేందర్ ఎగురవేశారు. ఉత్తమ ఉద్యోగుల ను సన్మానించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్య క్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏరియా ఎస్వో టూ జీఎం గుప్తా, సేవా అధ్యక్షురాలు స్వరూపా రాణి, పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్రావు, డీవైపీఎం తిరుపతి, ఏరియా ఇంజినీర్ తిరుమల్రావు, డీజీ ఎం(సివిల్) సతీశ్బాబు, పీవో శ్రీనివాస్, డీజీ ఎం(వర్క్షాప్) శివరామిరెడ్డి, జీఎం పీఏ రామ కృష్ణ, సేవా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, కైర్గూడ పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం ఉన్నారు. గోలేటి టీబీజీకేఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఏరియా ఉపాధ్యక్షుడు మ ల్రాజు శ్రీనివాసరావు ఎగురవేశారు. నాయకులు సంగెం ప్రకాశ్రావు, మారిన వెంకటేశ్వర్లు, మాం తు సమ్మయ్య, నల్లగొండ సదాశివ్, మిట్టపల్లి కు మారస్వామి, వినయ్కుమార్, దాసరి సాంబా గౌ డ్, బోయిని శంకరమ్మ, అన్నం లస్మయ్య, గం గిశెట్టి శ్రీనివాస్, దుర్గం రామయ్య ఉన్నారు.